మనఊరు-మనబడి పనులన్నీ మార్చి 31లోగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీపడొద్దని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్య, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. విధుల్లో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తయిన పనులకు సంబంధించి ఎఫ్టీవోలను వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లాలో బీటీ రెన్యువల్స్ పనుల పురోగతిపై ఆర్అండ్బీ ఎస్ఈతో కలిసి సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణాలు ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 25: జిల్లాలో మనఊరు-మనబడి కార్యక్రమాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ‘మనఊరు-మనబడి’ పనుల పురోగతిపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనఊరు-మనబడిలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చేపట్టిన పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడరాదన్నారు. ఆయా శాఖల ఈఈలు, డీఈలు, ఏఈలతో పనుల పురోగతిపై సమీక్షించాలని సూచించారు. కొన్ని మండలాల్లో పనుల పురోగతి నిర్దేశించిన లక్ష్యం మేరకు లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పనులు బాగా చేస్తున్న ఏఈలు, డీఈలను కలెక్టర్ అభినందించారు. పూర్తయిన పనులకు సంబంధించి వెంటనే ఎఫ్టీవోలను అప్లోడ్ చేయాలన్నారు. మార్చి 31లోగా ఈజీఎస్ పనులతో సహా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలకు వేస్తున్న పెయింటింగ్ క్వాలిటీ బాగుండాలని, పూర్తయిన పాఠశాలలకు వెంటనే పెయింటింగ్ పూర్తి చేయాలని ఏజెన్సీలకు సూచించారు. త్వరితగతిన డ్యూయల్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, చాక్ బోర్డులు ఫిట్ చేయాలని సంబంధిత సైప్లెంగ్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఈవో రాజేశ్, ఇంజినీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.