జహీరాబాద్, జూన్ 15 : దేశంలోనే పల్లెప్రగతి పనులు ఆదర్శంగా ఉన్నాయని, పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. గురువారం మొగుడంపల్లిలో పల్లె ప్రగతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచడం సంతోషంగా ఉందన్నారు. గతంలో మొగుడంపల్లి, నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతాలుగా ఉండేవని, ప్రస్తుతం మొగుడంపల్లి మండలంలోని 14 గ్రామపంచాయతీలకు అవార్డు లు రావడం గొప్ప విషయమన్నారు. గతంలో చూసిన మొగుడంపల్లికి, ఇప్పటి మొగుడంపల్లికి చాలా మార్పు వచ్చిందన్నారు.
పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. 2016లో పల్లెప్రగతిని ప్రభుత్వం ప్రా రంభించిందన్నారు. గతంలో ఎక్కడ చెత్త సేకరించేందుకు ట్రాక్టర్లు లేవు.. రిక్ష ఉండేందన్నారు. రిక్షతో చెత్తా సేకరించడం సాధ్యం కాలేదన్నారు. పల్లెప్రగతిలో జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసి చెత్త సేకరిస్తున్నామన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో మార్పువచ్చి రోగాలు తగ్గిపోయాయన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను చెత్తరహిత గ్రా మాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గతంలో సంగారెడి, సదాశివపేటలోనే నర్సరీ ఉండేది. ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పా టు చేసి మొక్కలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పారిశుధ్య కార్మికులు పనిచేయడంతోనే గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. గతంలో జిల్లాకు పల్లెప్రగతిలో రూ.19 కోట్లు మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుతం రూ.132 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేస్తుందన్నారు.
రూ. 518 కోట్లుతో పల్లె ప్రగతి పనులు చేసి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామన్నారు. పచ్చని చెట్లు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. సంగమేశ్వర, బసవేవ్వర్ ఎత్తిపోతలతో వ్యవసాయనికి సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. బీడు భూములకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ. 6 వేల కోట్లుతో ఎత్తిపోతల పనులు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మురళి, తహసీల్దార్ ప్రేంకుమార్, ఎంపీడీవో మహేశ్, గ్రామ సర్పంచు సుగుణమ్మ, బీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, కిషన్ పవార్ సజ్జరావుపేట గ్రామ సర్పంచు శంకర్నాయక్, మన్నాపూర్ సర్పంచు ఈశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్ల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.