శివ్వంపేట, మార్చి 28: గోమారంలో సోమవారం రాత్రి బండ యాదయ్యకు చెందిన గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరం. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి శాఖాపరంగా సబ్సిడీ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు.
బుధవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కుక్కల దాడిలో 28 గొర్రెలు మృతి వార్తకు జిల్లా పశు వైధ్యాధికారులు స్పందించి గొర్రెల మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 22 గొర్రెలు మృతి చెందాయని, మిగతా ఆరు గొర్రెలకు గాయాలు కాగా వాటిని చికిత్స అందిస్తున్నామని చెప్పారు. గొర్రెల పాక చుట్టూ సరైన రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలని పశు వైద్య సిబ్బంది బాధితులకు సూచనలు చేసినట్లు తెలిపారు.