శివ్వంపేట, అక్టోబర్ 20 : పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం శివ్వంపేటలో స్థానిక ఎస్ఐ రవికాంత్రావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా అమరవీరుల జ్ఞాపకార్థం నిర్వహించిన క్రీడా పోటీలను తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సమావేశంలో మాట్లాడుతూ అమరవీరులను గుర్తుచేసుకోవడం కోసమే స్మారక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తించే బీఎస్ఎఫ్, సీఐఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు చేస్తున్న సేవలు తెలిసి ఉండాలని, విధుల నిర్వహణ క్రమంలో అమరులైన వారిని ఎప్పటికీ స్మరించుకోవాలన్నారు. ప్రజలకు భద్రత కల్పించడం కోసమే పోలీస్స్టేషన్లు ఉన్నాయని, స్థానిక పోలీస్స్టేషన్లలో న్యాయం జరగకపోతే జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఆమె సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలవైపు మొగ్గుచూపాలన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ పో టీల్లో 45జట్లు తలపడనున్నాయని, క్రీడల్లో పాల్గొంటు న్న క్రీడాకారులకు పోలీసుశాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి నవీన్గుప్తా, ఉపసర్పంచ్ పద్మావెంకటేశ్, హెచ్ఎం నారాయణమ్మ, నాయకులు కొడకంచి శ్రీనివాస్గౌడ్, కొండకంచి రవీందర్గౌడ్, రవినాయక్, పీఈటీ ఆంజనేయు లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు, పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లోనే అనంతలోకాలకు..
కోహీర్, అక్టోబర్ 20 : మండలంలోని గురుజువాడకు చెందిన కానిస్టేబుల్ సురేశ్కుమార్ పోలీస్శాఖలో విధులు నిర్వహిస్తూ మర ణించాడు. అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు యత్నించిన సురేశ్కుమార్ స్మగ్లర్ల చేతిలో అమరుడయ్యాడు. గురుజువాడ గ్రామానికి చెందిన సుశీలమ్మ కొడుకు సురేశ్కుమార్ 2007 డిసెంబర్ 25న పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాడు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేవాడు. విధుల నిర్వహణలో భాగంగా 2010 మార్చి 30వ తేదీన అటవీ ప్రాంతానికి వెళ్లి స్మగ్లర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రభుత్వం ద్వారా అతడి కుటుంబాన్ని ఆదుకున్నది. అతని తమ్ముడు నరేశ్కుమార్కు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం కల్పించింది.
ఆన్లైన్ ఫొటో గ్రఫీ
అమర పోలీసుల జ్ఞాపకార్థం నేడు పోలీస్ ప్లాగ్ డేగా పాటిస్తున్నామని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ప్లాగ్ డే సందర్భం గా పోలీసులు ఆన్లైన్ ఫొటోగ్రఫీ పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్, అత్యవసర సేవలకు హాజరు కావడం, విపత్తు నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాలు, ఆసక్తి కలిగించే ఏదైనా ఇతర కార్యకలాపం ప్రతి కేటగిరీకి చెందిన మూడు ఉత్తమ ఛాయాచిత్రాలకు సంబంధించి పౌరులు క్యాప్చర్ చేసిన ఫొటోలను ఈ నెల 28 లోపు సమర్పించాల్సిందిగా కోరారు. ప్రతి కేటగిరీకి చెందిన మూడు ఉత్త మ ఛాయాచిత్రాలకు బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు.