నర్సాపూర్, డిసెంబర్12: నర్సాపూర్ నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.69.41 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజన తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.138 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు. అందులోంచి రూ.69కోట్ల 41 లక్షలు మంజూర య్యాయన్నారు. వచ్చే బడ్జెట్లో రూ.69 కోట్లు వచ్చేలా కృషి చేస్తానని, దీంతో ప్రతి తండాకు బీటీ రోడ్డు పడే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రూ.69 కోట్ల 41 లక్షలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సాపూర్ నియోజకవర్గానికే ఇంత బడ్జెట్ రావడం సంతోషంగా ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పాటు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాబ్యానాయక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, వివిధ గ్రామాల గిరిజన సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.