సిద్దిపేట రూరల్, జూన్ 20 : నా చివరి రక్తపు బొట్టు మీకోసం ధారపోస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం రూ.9 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పుల్లూరు వరకు రూ.2.95కోట్లతో డబుల్లేన్ బీటీరోడ్డుకు, ఎస్సీ కాలనీ నుంచి రామంచవరకు రూ.3కోట్లతో బీడరోడ్డుకు, గాడిచెర్ల మీదుగా నాసర్పురా వరకు రూ.కోటి 56 లక్షలతో రోడ్డు మరమ్మతు పనులకు, రూ.40లక్షలతో పుల్లూరు గ్రామంలోని సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రావురూకుల స్టేజీ వద్ద మంత్రి మాట్లాడుతూ పుల్లూరు గ్రామంలోని పీహెచ్సీ, ఏఎన్ఎం సబ్సెంటర్, అర్బన్ పీహెచ్సీ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్వో కాశీనాథ్ను మంత్రి ఆదేశించారు.
ప్రజల గౌరవం పెంచేలా పని చేస్తున్నానని, మీ గౌరవం తగ్గే పనులు ఎప్పుడూ చేయనని మంత్రి అన్నారు. అక్కడక్కడ పల్లెరుకాయల్లో మోపై ఏదో ఏదో మాట్లాడుతుంటారని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఒకప్పుడు రోడ్డు బాగోలేకుంటే బస్సు వస్తలేదని, ఆటో వస్తలేదని చెప్పేవాళ్లన్నారు. ప్రస్తుతం ఎటు చూసినా విశాలంగా రోడ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎంపీపీ శ్రీదేవీరామచందర్రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, సర్పంచ్ పల్లె నరేశ్గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.