రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే హత్యలు, గంజాయి, మత్తుమందు రవాణా కేసులు, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గగా, దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం పెరిగింది. మెదక్ జిల్లాలో రోడ్డు యాక్సిడెం తగ్గినప్పటికీ హత్యలు, లైంగిక దాడులు పెరిగాయి. ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువ కావడంతో సైబర్ నేరగాళ్లు వినియోగదారుల బ్యాంకు ఖాతాల నుంచి రూ.59.88లక్షలు కాజేశారు. 115 కేసులు నమోదవగా, రూ.7.27లక్షలు రికవరీ చేశారు. ముఖ్యమైన కేసుల ఛేదనలో ప్రతిభ కనబర్చి, అంకితభావంతో పనిచేసిన పోలీసులకు ఉన్నతాధికారులు ప్రశంసలు, రివార్డులు అందజేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పెట్రోలింగ్ , గస్తీతో నిర్వహించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. షీటీం ద్వారా ఆకతాయిల ఆటకట్టిస్తూ మహిళా రక్షణకు పెద్దపీట వేస్తున్నారు.
-సంగారెడ్డి/మెదక్ (నమస్తే తెలంగాణ), డిసెంబర్ 28
మెదక్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో గతంతో పోలిస్తే కాస్త్త రోడ్డు ప్రమదాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు, హత్యలు, లైంగిక దాడులు పెరిగాయి. క్షణికావేశం, తొందరపాటు, ప్రేమ విఫలం కావడం లాంటి చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరం. రాత్రిపూట దొంగతనాలు, ఆటో మొబైల్ దొంగతనాలు పెరిగాయి. ఇకపోతే సైబ ర్ క్రైమ్లు కూడా పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో రోడ్లు సైతం రక్తమోడాయి. గత సంవత్సరం 463 ప్రమదాలు జరుగగా, 283మంది చనిపోగ ఈ ఏడాది 460 ప్రమాదాలు జరిగి 232 మంది చనిపోయారు. అంటే రోడ్డు ప్రమదాలు ఈ ఏడాది తగ్గాయి. ఇదిలావుండగా మహిళలపై నేరాలు పెరిగాయి. 2021లో 307కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 336 కేసులు నమోదయ్యాయి. జిల్లా పోలీసుశాఖ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పెట్రోలింగ్, సీసీ కెమెరాలు, పోలీసుల గస్తీతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. షీటీం ద్వారా ఆకతాయిల ఆటకట్టిస్తూ మహిళ రక్షణకు పెద్దపీట వేస్తున్నారు.
పెరిగిన సైబర్ నేరాలు, దొంగతనాలు…
మెదక్ జిల్లాలో 2022లో సైబర్ నేరాలు పెరిగాయి. ఆన్లైన్లో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం, సీంలు, చీటీల పేరిట చీటింగ్ చేసి కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం ఈ యేడు జిల్లాలో ఎకువగానే కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల కింద 115 కేసులు నమోదు కాగా సుమారు రూ. 59.88లక్షల నగదు ప్రజల నుంచి కాజేశారు. అందులో 88 కేసుల్లో రూ. 7 లక్షల 27వేలను రికవరీ చేసి కేసులను ఛేదించారు. దీంతో పాటు ఈ యేడు ఇండ్లలో రాత్రిపూట దొంగతనాలు పెరిగాయి. తాళం వేసిన ఇడ్లలోనే టార్గెట్ చేస్తూ దొంగతనాలు పెరిగాయి. మొత్తం 390 దొంగతనాలు జరిగాయి.
ఇందులో దోపిడీలు గత సంవత్సరం 2 కాగా, ఈ ఏడాది 12 నమోదయ్యాయి. పగటి దొంగతనాలు గత సంవత్సరం 11 కాగా, ఈ ఏడాది 15 నమోదయ్యాయి, రాత్రి దొంగతనాలు గత సంవత్సరం 97 కాగా, ఈ ఏడాది 112 నమోదయ్యాయి. గొలుసు దొంగతనాలు గత సంవత్సరం 11 కాగా, ఈ ఏడాది 9 అయ్యాయి. దొంగతనాలు గత సంవత్సరం 122కాగా, ఈ ఏడాది 116 నమోదయ్యాయి. ఆటో మొబైల్ దొంగతనాలు గతేడాది 45 కాగా, ఈ ఏడాది 119 నమోదయ్యాయి. అత్యాధునిక టెక్నాలజీని పోలీసు శాఖ వినియోగించుకుంటూ సీసీ కెమెరాల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో ప్రతీ పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోనూ ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడినట్లు పోలీసు శాఖ అధికారులు పేరొంటున్నారు.
పెరిగిన వాహన తనిఖీ లు… డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
జిల్లాలో గతేడాది వాహన తనిఖీ కేసులు తగ్గాయి. ఈ ఏడా ది పెరిగినట్టు పోలీసులు తెలిపారు. 2021 సంవత్సరంలో 1,41,152 కేసులు నమోదు కాగా, 2022 సంవత్సరంలో 4,35,137 కేసులు నమోదయ్యాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 2021 సంవత్సరంలో 1138 కేసులు నమోదు కాగా, ముగ్గురు జైలు పాలయ్యారు. 2022లో 8011 కేసులు నమో దు కాగా, ఐదుగురికి జైలు శిక్ష విధించారు. అక్రమ ఇసుక రవా ణా కేసుల్లో 2021వ సంవత్సరంలో 213కేసులు నమోదు కాగా, 2022లో 198 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ మర్డర్ కేసుల్లో 2021లో 46 కేసులు కాగా, 2022లో 30 కేసు లు మాత్రమే నమోదయ్యాయి. పేకాట కేసుల్లో 2021లో 47 కేసులు నమోదు కాగా, రూ. 8,71,887 నగదును సీజ్ చేశారు. 2022లో 45కేసులు నమోదై రూ. 8,25,603 నగదును సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఉత్తమ సేవలకు పోలీసులకు ప్రశంసలు, రివార్డులు
జిల్లా పోలీసుశాఖ ముఖ్యమైన కేసుల చేధనలో జిల్లా ప్రజలు, ఉ న్నతాధికారుల మన్ననలు పొందింది. అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రివ్వార్డ్స్ అందించారు. చేగుంట పోలీస్స్టేషన్లో రిసెప్షన్గా పనిచేస్తున్న డి.మౌనిక నాలుగుసార్లు రివార్డ్సు అందుకుంది. కొల్చా రం పీఎస్లో బ్లూ కో ట్స్ పి.మహేశ్కుమార్ నాలుగుసార్లు రివార్డ్సు తీసుకోగా, మెదక్ రూ రల్ పోలీస్స్టేషన్లో పెట్రోల్ కార్లో పనిచేస్తున్న వెంకటయ్య ఐ దుసార్లు, రామాయంపేట, హవేళీఘనపూర్ పోలీస్స్టేషన్లో సెక్షన్ఇన్చార్జిగా పనిచేస్తున్న వీరన్న, మల్లేశం మూడుసార్లు, అల్లాదుర్గం పోలీస్స్టేషన్లో స్టేషన్ రైటర్గా పనిచేస్తున్న సుధీర్కుమార్ నాలుగుసార్లు, కౌడిపల్లి, రామాయంపేట పోలీస్స్టేషన్లో టెక్నికల్ టీమ్లో కవిత, రాజులు మూడు సార్లు, తూప్రాన్ పోలీస్స్టేషన్లో కోర్టు డ్యూటీలో లక్ష్మారెడ్డి ఐదుసార్లు, రేగోడ్ పోలీస్స్టేషన్లో వారంట్స్గా పనిచేస్తున్న వినోద్ నాలుగుసార్లు, తూప్రాన్ పోలీస్స్టేషన్లో సమాన్స్లో పని చేస్తున్న నాగరాజు మూడుసార్లు, హవేళీఘనపూర్ పోలీస్స్టేషన్ ఎస్ఐ మురళీ 8సార్లు, మనోహరాబాద్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో రాజు ఆరుసార్లు, కౌడిపల్లి పోలీస్స్టేషన్లో సురేశ్ రెండుసార్లు, రామాయంపేట పోలీస్స్టేషన్ ట్రాఫిక్ ఎస్సై రామచందర్ రెండుసార్లు రివార్డ్స్ అందుకున్నారు.
2022లో తగ్గిన నేరాల సంఖ్య
సంగారెడ్డి డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ శాంతిభద్రతలకు అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వాలకంటే అధికంగా ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పోలీసుశాఖకు నిధుల కేటాయింపు పెంచారు. సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖ రోడ్డు ప్రమాదాలు, నేరాల అదుపు చేసేందు కు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితంగా గతేడాది తో పోలిస్తే 2022లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జిల్లా లో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగినా, హత్యలు తగ్గా యి. దొంగతనాలు పెరిగినప్పటికీ రికవరీ సంఖ్య గణనీయంగా పెరిగింది. గంజాయి రవాణా, మత్తుమందుల రవాణాకు సం బంధించిన కేసులు తగ్గాయి. సైబర్ నేరాలపై అవగాహన లేకపోవటంతో నేరాల సంఖ్య పెరిగింది. ఆన్లైన్లో డబ్బులు చెల్లిం చి, లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా డబ్బులు కోల్పోయిన కేసులు పెరిగాయి. సంగారెడ్డిలోని ప్రముఖ విద్యాసంస్థలో పనిచేసే ఉద్యోగి సైబర్ మోసం కారణంగా రూ. 2కోట్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది. సైబర్క్రైమ్ కేసుల్లో పోలీసులు విచారణ చేసి, డబ్బులు రికవరీ చేశారు.
2022లో నేరాలు తగ్గాయి
సంగారెడ్డి జిల్లాలో 2022 లో నేరాలు తగ్గాయి. నిఘా పెంచడం వల్ల జిల్లాలో పెద్ద నేరాలు చోటు చేసుకోలేదు. గతేడాది పోలీస్తే నేరాల సంఖ్య తగ్గింది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా పెరిగినా ప్రమాదాల్లో మరణించి వారి సంఖ్య తగ్గింది. అతివేగం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించటంవల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. పోలీసుశాఖ సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది ఐఐటీతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళిక రూపొందించాము. జిల్లాలో అన్ని రకాల కేసులు తగ్గాయి. జిల్లాలో పోలీసు నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు పెంచాము. జిల్లాలో 5500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలి.
– రమణకుమార్, సంగారెడ్డి ఎస్పీ