సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో పెద్దఎత్తున నిషేధిత అల్ప్రాజోలం డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓయో రూం అద్దెకు తీసుకొని అల్ప్రాజోలం ముడి సరుకును కొన్ని రసాయనాలతో మత్తుమందు తయారు చేసి పేద, మధ్యతరగతి వారికి విక్రయిస్తున్న నలుగురిని జిల్లా పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీం అరెస్టు చేసిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.74 లక్షలు విలువైన కొన్ని రసాయన పదార్థాలు, అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మధ్యకాలంలో అనేక మంది యువతీయువకులు డ్రగ్స్, గంజాయికి అలవాటుపడి అనేక నేరాలు చేస్తున్నారని, ఎవరైనా డ్రగ్స్, గంజాయి అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు.
సంగారెడ్డి అర్బన్ 27: సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో పెద్దఎత్తున నిషేధిత అల్ప్రాజోలం డ్రగ్స్ ముడి సరుకును పట్టుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ బుధవారం మీడియాకు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓయో రూం అద్దెకు తీసుకొని అల్ప్రాజోలం ముడి సరుకును కొన్ని రసాయనాలతో కలిపి మత్తుమందు తయూరు చేసి పేద, మధ్యతరగతి వారికి విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారంతో జిల్లా పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీం దాడులు చేసిందని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి కొన్ని రసాయన పదార్థాలు, అల్ప్రాజోలం పట్టుకున్నామని, దీని విలువ సుమారు రూ.74 లక్షలు ఉంటుందన్నారు. నలుగురు నిందితులు వీరిలో బ్రహ్మానందగౌడ్, చిరుగూరి డేవిడ్, కొండాపురం శివను అరెస్ట్ చేశామని ఎస్పీ రూపేశ్ తెలిపారు. బ్రహ్మానందగౌడ్, డేవిడ్కు 2018లో డ్రగ్స్ కేసులో జైలు శిక్ష పడిందన్నారు. వీరిద్దరూ జైలులో కలుసుకొని బయటికి వచ్చిన తర్వాత కల్లులో కలిపే అల్ప్రాజోలం యూనిట్ను ప్రారంభించారని తెలిపారు. రెండేండ్ల కిందట బెయిల్పై వచ్చిన బ్రహ్మానందగౌడ్ పటాన్చెరుకు చెందిన డేవిడ్ కుటుంబసభ్యుల సాయంతో 6 నెలల కిందట యూనిట్ను ప్రారంభించారని ఎస్పీ చెప్పారు. ఓ కంపెనీలో కెమిష్టిగా పని చేస్తున్న కొండాపుర్కు చెందిన శివకుమార్ను నియమించుకొని అక్రమ దందా చేస్తున్నారన్నారు. ఈ మధ్యకాలంలో అనేక మంది యువతీయువకులు డ్రగ్స్, గంజాయికి అలవాటుపడి అనేక నేరాలు చేస్తున్నారని, ఎవరైనా డ్రగ్స్, గంజాయి అమ్మినా, తయారు చేసినా, కొన్నా వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లు తెలిస్తే సంగారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో డీఎస్పీ రమేశ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శివలింగం, సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.