వట్పల్లి/అల్లాదుర్గం, ఏప్రిల్ 18 : సర్వమతాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం వట్పల్లిలో (46)కల్యాణ లక్ష్మి, (38)షాదీ ము బారక్, (18) సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పేద ముస్లిం కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువులకు బతుకమ్మ చీరలు అందించినట్లు ముస్లింలు, క్రిస్టియన్లకు రంజాన్, క్రిస్మస్ పండుగలకు బట్టలు పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం లభిస్తున్నదన్నారు. పండుగలను సాంప్రదాయబద్ధంగా, సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. రంజాన్ పండుగను సోదరభావంతో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అంజియాదవ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేసిన ఎమ్మెల్యే..
రామచంద్రాపురం,ఏప్రిల్18: రంజాన్ పర్వదినాలను ప్రతి ముస్లిం సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల్లోని పలు మసీద్ల వద్ద ఆయా డివిజన్ల కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్లతో కలిసి ముస్లింలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ముస్లిం రంజా న్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ పండుగ బట్టలు అందజేస్తున్నారని తెలిపారు. రంజాన్ పర్వదినాల్లో ముస్లింలను అందరిని ఒక చోటుకి చేర్చి ప్రభుత్వమే ఇఫ్తార్ విందు ఇస్తుందన్నారు. ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సర్కా ర్ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, మా జీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు బూన్, ఐలేశ్, సత్యనారాయణ, అజీమొద్దీన్, కుత్బుద్దీన్, సోహైల్ ఉన్నారు.
అమీన్పూర్లో మసీద్ ప్రారంభం
అమీన్పూర్,ఏప్రిల్ 18 : రంజాన్ మాసం పవిత్రమైన మాసమని, ఈ మాసంలో మూస్లింలు మతాలకతీతంగా ఇఫ్తార్ విందుల పేర ఐక్యత ప్రదర్శించి తమ పవిత్రతను చాటుకుంటారని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్లోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో సొంత నిధులతో నిర్మించిన మసీదును ప్రారంభించారు. అనంతరం ఇఫ్తార్ విం దు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోర కు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. అంతే కాకుండ షాదీ ముబారక్ పథకంతో అనేకమంది నిరుపేద ముస్లిం ఆడపిల్లలకు దీమా లభిస్తుందన్నారు. రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకునేందుకు కొత్త దుస్తువులను అందిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్లుబాసెట్టి కృష్ణ, కల్పన ఉపేందర్రెడ్డి, బీజీలి రాజు, కో-ఆప్షన్ సభ్యులు యూనుస్, తలారి రాములు, ముస్లిం నాయకులు రాజవర్ధన్రెడ్డి, మహేందర్రెడ్డి, ఆసీఫ్ పాల్గొన్నారు.