సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15 : మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వేనిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైల్వేలైన్ పూర్తయి, రైల్వేసేప్టీ కమిషనర్ అనుమతులు ఇవ్వడంతో ట్రయ ల్న్ నిర్వహించారు. ఆ ట్రయల్న్ విజయవంతం కావడంతో గజ్వేల్ వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. శుక్రవారం గజ్వేల్ నుంచి సిద్దిపేటకు నిర్వహించిన ట్రయల్న్ విజయవంతమైంది.
దీంతో త్వరలోనే సిద్దిపేట వరకు రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రైల్వేసేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి ట్రయల్ రన్ కోసం సిద్దిపేట రైల్వేస్టేషన్కు ప్యాసింజర్ రైలు విజయవంతంగా చేరుకున్నది. ట్రయల్ రన్ను అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. ట్రాక్ వెంట తిరుగుతూ నిర్మాణ తీరును పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయి రైలు సేవలు సిద్దిపేటకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
సాకారం చేసిన సీఎం కేసీఆర్
సమైక్య రాష్ట్రంలో మనోహరాబాద్ -కొత్తపల్లి రైల్వేలైన్ గురించి అప్పటి పాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ కృషితో ఈ రైల్వేలైన్ పట్టాలెక్కుతున్నది. సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ పనులు చేపడుతున్నారు.తొలి దశలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడ-కండ్ల, లకుడారం, దుద్దెడ వరకు రైలు నడపడానికి రైల్వే సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్నటికే హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు రైలు సేవలు ప్రారంభమై గూడ్స్ నడుస్తున్నాయి.
గజ్వేల్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేయడంతో సనత్నగర్ రేక్ పాయింట్కు వెళ్లాల్సిన శ్రమ తగ్గింది. సిద్ది-పేట నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్ వరకు రెగ్యులర్ రైలు నడిపేందుకు కృషిచేస్తున్నారు. దీంతో పాటు తిరుపతి, బెంగళూరు ప్రాంతాలకు రైళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం మెదక్ జిల్లాలో 9.30 కి.మీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీటర్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కి.మీటర్ల మేర మొత్తం 151.36 కి.మీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తున్నారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వేస్టేషన్లు నిర్మిస్తున్నారు.
మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషి
రైలు కల నెరవేరే సమయం సమీపిస్తుండడంతో సిద్దిపేట వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే మంత్రి హరీశ్రావు రైలు ట్రయల్ రన్కు జెండా ఊపారు. సిద్దిపేట శివారులోని నర్సాపూర్ కేసీఆర్ నగర్ కాలనీ సమీపంలో రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి.మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణ, భూసేకరణ, ఇతర సమస్యలపై ఎప్పటికప్పడు అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల్లో వేగాన్ని పెంచారు. స్టేషన్ వద్ద ట్రాక్, సీసీ తదితర పనులు చివరి దశకు వచ్చాయి.
ఇక్కడ ఐదు ట్రాక్లైన్లలో మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, 4వ లైన్లో గూడ్స్ రైళ్లు, 5వ లైన్లో ప్యాకింగ్, మరమ్మతులు, ఇంజిన్ల సైడింగ్ కోసం వినియోగిస్తారు. ఇక్కడనే గూడ్స్ షెడ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనున్నది. పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే రైల్వేలైన్ పెద్దపల్లి వద్ద కలుస్తుంది. దీంతో కలకత్తా, న్యూఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. మనోహరాబాద్ నుంచి ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు.
ఈ రైల్వేలైన్ నిర్మాణంతో మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది.ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే రైల్వేలైన్ అని చెప్పవచ్చు. వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు ఉన్నాయి. గజ్వేల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కాలుష్య రహిత పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగాయి. భవిష్యత్లో మంచి పర్యాటక ప్రాంతం కానున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ ఉన్నది.
ఇక్కడికి సుమారుగా 30 కి.మీ దూరంలో కొండపోచమ్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయం పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అక్కడి నుంచి మరో 25 కి.మీ దూరంలో భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న ఆలయం ఉంది. ఇక్కడికి రా్రష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల భక్తులు తరలివస్తారు. మల్లన్నను దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు వెళ్లవచ్చు. ఇక ఉత్తర తెలంగాణ వరప్రదాయి కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మల్లన్న వనాల పేరుతో మంచి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నారు.