దుబ్బాక, నవంబర్ 14: నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను ఆదరించాలని పార్టీ దుబ్బాక మండల పరిశీలకుడు ఎల్లు రవీందర్రెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి కోరారు. మంగళవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్, హసన్మీరాపూర్, రఘోత్తంపల్లి, చీకోడు, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ధి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కేసీఆర్ సర్కారు వచ్చాక పదేండ్లలో జరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో దొంగ హామీలతో గెలిచిన రఘునందన్రావు మూడేండ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ననాయకు లను ప్రజలు నమ్మవద్దన్నారు. మాయమాటలతో వచ్చే మోసగాళ్లను నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే మూడేండ్లు అభివృద్ధిలో దుబ్బాక వెనుకడుగు వేసిందన్నారు. పని చేసే బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు. బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, నిస్వార్థ నాయకుడు కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి దుబ్బాకను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రభాకర్రెడ్డికి ప్రజలందరూ మద్దతు అందించాలని కోరారు. ఈ ఎన్నికలు ఓ నిస్వార్థ నాయకుడికి ఓ మోసగాడికి మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమన్నారు. మీ విలువైన ఓటును బీఆర్ఎస్కు వేసి, ధర్మాన్ని గెలిపించాలని కోరారు.
దుబ్బాక మండలం హసన్మీరాపూర్, అక్బర్పేట-భూంపల్లి మండలం నగరం గ్రామంలో మంగళవారం ఎస్సీ కుటుంబాలు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నగరం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి సమక్షంలో సుమారు 40 ఎస్సీ కుటుంబాలు కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతు తెలిపాయి. హసన్మీరాపూర్లో బీఆర్ఎస్ దుబ్బాక మండల పరిశీలకుడు ఎల్లు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి సమక్షంలో ఎస్సీలందరూ ముక్తకంఠంతో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు కిషన్రెడ్డి, నారాగౌడ్, శ్రీనివాస్, కొంగరి రాజయ్య, తౌడ శ్రీనివాస్ పాల్గొన్నారు.