నేడు మృగశిర కార్తె
చేపలకు భలే గిరాకీ
ఇప్పటికే పట్టిన చేపలతో కళకళలాడుతున్న చేపల మార్కెట్లు
మృగశిర కార్తెను పురస్కరించుకుని మత్స్యకారులు చేపల వేటలో మునిగిపోయారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువులో చేపలను పట్టి విక్రయించారు. వలలకు 10 నుంచి 12 కేజీల చేపలు చిక్కడంతో మత్స్యకారులుసంతోషం వ్యక్తం చేశారు. చేపలకు మంచి ధర వచ్చింది.
మెదక్ మున్సిపాలిటీ/ సదాశివపేట/అందోల్, జూన్7: ఎండలు పోయి, చల్లటి వాతావరణం ఏర్పడే మృగశిర కార్తె బుధవారం ప్రవేశించనున్నది. కృతిక, రోహిణి కార్తెల్లో ఎండలు దంచికొట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడగా మృగశిర ప్రవేశంతో ఎండలు తగ్గి వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో కార్తె ప్రకృతిలో పలు రకాల మార్పులను తీసుకువస్తుండగా ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన రోజునుంచి నైరుతి రుతుపవనాలు వచ్చేస్తాయి. దీంతో మృగశిర కార్తెలో చల్లటి వాతావరణం ప్రారంభమవుతంది. ఈ నెల 8వతేదీనుంచి ప్రారంభమయ్యే ఈ కార్తె ఈ నెల 21 వతేదీవరకు ఉంటుంది. ఈ కార్తెలో తొలకరి జల్లులు కురియగానే వ్యవసాయ పనులు జోరందుకుంటాయి.
చేపలు తినాల్సిందే..
చేపలు తినడానికి ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే తేడా ఉండదు.. మృగశిర కార్తె ప్రవేశించిన రోజే చేపలు తినాలనే నానుడి ఉంది. ప్రతి ఒక్కరూ చేపల కూర తినేందుకు ఆరాటపడుతుంటారు. కొందరు బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం అనాధిగా వస్తున్నది. మృగ శిర కార్తె రావడంతో శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందనే భావన ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకుగానూ చేపలు తినడంతో రోగాలు దరిచేరవనే నమ్మకం. ము ఖ్యంగా దగ్గు, ఆస్త మా, గుండె తదితర జబ్బులు రాకుం డా అరికడుతుంది. చేపల్లో మంచి పోషకాలు, మాంసకృతులు ఉండి తేలికగా జీర్ణమవుతాయి. కాల్షి యం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. మాంసాహారుల ఇండ్లలో మృగశిర రోజున చేపల పులుసు, చేపల వంటకాలు తప్పనిసరి. ఈ కార్తె ప్రారంభంతో చేపల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తు తం మార్కెట్లో కిలో బొమ్మె చేపల ధర ఐదు వందల రూపాయల వరకు విక్రయిస్తుండగా, మృగశిర కార్తె రోజు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.