వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తొలకరి వర్షాలు పడుతుండగా రైతులు దుక్కులు దున్నడంతో పాటు పంటలు సాగుచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ‘రైతుబంధు’ డబ్బులు అకౌంట్లలో జమ చేస్తుండడంతో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. డిమాండ్కు సరిపడా యూరియా, డీఏపీ, పొటాష్, ఎన్ఎస్పీ, కాంప్లెక్స్ తదితర ఎరువులతోపాటు విత్తనాలు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీలర్లతో సమావేశాలు నిర్వహించి స్టాక్పై దిశానిర్దేశం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుత వానకాలం సీజన్లో 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందుకోసం 96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు,78వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 7,26,124 ఎకరాల్లో వివిధ పంటలు పండించనుండగా, 1,23లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాల్సివస్తుందని పేర్కొన్నారు. సీజన్ పూర్తయ్యేవరకు రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని, ఎక్కడా కొరత తలెతొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేయడంతో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
– సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ), జూన్ 27
మెదక్/ సంగారెడ్డి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతాంగానికి జిల్లా అధికార యంత్రాంగం ఎరువులను సిద్ధం చేసింది. వానకాలం సీజన్ మొత్తం రైతులకు ఎప్పుడంటే అప్పుడు ఎరువులను అందించేలా వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్ కు సరిపడా యూరియా, డీఏపీ, పొటాష్, ఎన్ఎస్పీ, కాం ప్లెక్స్ తదితర ఎరువులు నిరంతరం సరఫరా చే యడానికి అధి కారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతానికి అవసరమైన ఎరువుల నిల్వలు మెదక్ జిల్లాలో అందుబాటులో ఉన్న ట్టు అధికారులు పేర్కొంటున్నారు. మెదక్ జిల్లాలో తొలకరి వ ర్షాలు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమ గ్నమయ్యారు. దుక్కులు దున్నడంతోపాటు పంట సాగుకు అన్ని ఏర్పాట్లు
చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రిక సాగు విధానానికి సిద్ధమవుతూ అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు.
3.76 లక్షల ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ వ్యవసాయ డివిజన్లో వానకాలం పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయశాఖ రూపొందించింది. గతంతో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. గడిచిన వానకాలంలో 3.50 లక్షల ఎకరాల్లో పంట లు సాగు చేయగా, ఈ వానకాలం సీజన్లో 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. 3.10 లక్షల ఎకరాల్లో వరి పంట, 45 వేల ఎకరాల్లో పత్తి, 7వేల ఎకరాల్లో మొక్కజొన్న, 4 వేల ఎకరాల్లో కంది, 11 వేల ఎకరాల్లో మినుము, 1500 ఎకరాల్లో పెసర్లు, 120 ఎకరాల్లో సోయాబీన్, 200 ఎకరాల్లో జొన్న, 5500 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు.
78వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
మెదక్ జిల్లాలో ఖరీఫ్ పంటలకు అనుగుణంగా విత్తనాల ను అందుబాటులో ఉంచడానికి వ్యవసాయాధికారులు పంట సాగు అంచనా ప్రణాళికలు రూపొందించారు. 77,700 క్విం టాళ్ల వరి విత్తనాలు, 720 క్వింటాళ్ల మొకజొన్న, 228 క్విం టాళ్ల పత్తి, 123 క్వింటాళ్ల కంది, 43 క్వింటాళ్ల పెసర, 135 క్వింటాళ్ల మినుముతోపాటు ఇతర పంటల విత్తనాలు అవస రం. డిమాండ్ సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు మెదక్ జిల్లా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నది.
96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానకాలం సీజన్లో జిల్లాకు 96.34లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశా రు. 41,000 మెట్రిక్ టన్నుల యూరియా, 6,500 మెట్రిక్ టన్ను ల డీఏపీ, 36,450 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 7590 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 4800 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ అవసర మని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎరువుల సర ఫరా నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. సహకార సంఘా లు, గుర్తింపు పొందిన సంస్థల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడానికి కసరత్తు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టి లో ఉంచుకుని మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎరువులను నిల్వ చేసేందుకు అధికారులు యుద్ధ ప్రా తిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
సబ్సిడీపై ఎరువులు, విత్తనాల అందజేత
రైతులకు ఎరువులు, విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) సబ్సిడీపై అందజేస్తున్నారు. ఇప్పటికే జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల ఎరువులను సైతం విక్రయిస్తున్నారు. సొసైటీ ల ద్వారా యూరియా బ స్తాను సబ్సిడీపై రూ. 265, డీఏపీని సబ్సిడీపై రూ.1350 అందజేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపు ల్లో యూరియా బస్తాను రూ.300, డీఏపీ రూ.1400 అమ్ముతున్నారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా, ఒక బస్తా డీఏ పీ, ఒక బస్తా పొటాష్ అందజేస్తున్నారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ పత్రాలతో ఎరువులను తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం విత్తనాలు విత్తుకునే దశలో రైతు లు యూరియా, డీఏపీ కలిపి చల్లుతుంటారు. అవసరమైన ఎరువులను అందుబాటులో
ఉంచామని, పంట చేతికి వచ్చే వరకు తెప్పిస్తామని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అందుబాటులో 1.23 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో రైతులు 7,26,124 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. వర్షాలు కురుస్తుండడం తో 8 లక్షల ఎకరాల్లో పైగా పంటలను సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అధి కంగా పత్తి సాగు కానుంది. 3,53,903 ఎకరాల్లో పత్తి పంట, 1,41,135 ఎకరాల్లో వరి, 82,803 ఎకరాల్లో కంది, 82, 559 ఎకరాల్లో సోయాబీన్ పంటలు సాగు అవుతాయని అం చనా. 864ఎకరాల్లో
జొన్న, 16,064 ఎకరాల్లో మొక్కజొన్న, 13,462 ఎకరాల్లో పెసర, 6516 ఎకరాల్లో మినుము, 27, 268 ఎకరాల్లో చెరుకు పంటను సాగుచేయనున్నారు. రాగి పంట 17.35 ఎకరాలు, ఆముదం 24.7 ఎకరాలు, 6.17 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 7.33 ఎకరాల్లో కొర్రలు, 33.97 ఎకరాల్లో నువ్వులు, 7.41ఎకరాల్లో వేరుశనగ, 74.1 ఎకరా ల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 131279 ఎకరాల్లో
పంటలు సాగు చేయగా, అధికంగా 1,13,348 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు.
రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు
వానకాలం సీజన్ కోసం జిల్లాకు 1,23,136 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. జిల్లాలో 474 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. వీరివద్ద 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. 12,547 టన్నుల యూరియా, 8218 టన్నుల డీఏపీ, 425 టన్నుల ఎంవోపీ, 627 టన్నుల ఎస్ఎస్పీ, 8114 టన్నుల ఎన్పీకే ఎరువులను అందుబాటులో ఉంచారు. రైతులు ఇప్పటి వరకు 12వేల మెట్రిక్ టన్నుల ఎరువులను కొనుగోలు చేశారు. రైతులకు అవసరమైన మేర ఎరువులను బఫర్ స్టాక్ను అందుబాటులో ఉంచనున్నారు. ఎరువులతోపాటు విత్తనాలను వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత సీజన్ లో 35283 టన్నుల వరి, 51.84 టన్నుల జొన్న, 1124 టన్నుల మొక్కజొన్న, 3312 టన్నుల కంది, 24767 టన్నుల సోయాబీన్, 521 టన్నుల మినుము, 1076 టన్నుల పెసర విత్తనాలు అవసరం కానున్నాయి. 524 మంది విత్తనాల డీలర్ల వద్ద విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 40 శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందజేశారు. జీలుగ 6 వేల క్వింటాళ్లు, 4 వేల క్వింటా ళ్ల జనుము విత్తనాలను రైతుల కు అందుబాటులో ఉంచుతున్నారు.