చేర్యాల, అక్టోబర్ 12 : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన గీస భిక్షపతి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రస్ట్బోర్డు మొదటి సమావేశంలో బోర్డు సభ్యులు, అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు రాజగోపురం, ప్రసాదాల తయారీ ప్రదేశం, రాతీగీరలు తదితర ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న తోపుడు బండ్లను రెండు రోజులుగా తొలిగించే కార్యక్రమాన్ని ఆలయవర్గాలు ప్రారంభించాయి.
50 నుంచి 100 మేరకు ఉన్న బండ్లను మరో ప్రదేశానికి తరలించారు. తోపుడు బండ్లతో దర్శనం టికెట్లు, మొక్కుబడి టికెట్లు, గదుల విచారణ, ప్రసాదాల విక్రయశాల, నిత్యాన్నదాన సత్రం అసలు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. బండ్లను తొలిగించడంతో భక్తుల సమస్య తీరడంతో పాటు ట్రస్ట్బోర్డు మొదటి సమావేశంలో తీర్మాణానికి సైతం మోక్షం కలిగినట్లు అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ చైర్మన్ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను పట్టించుకోకుండా మల్లన్న క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తుండడంతో పలువురు అభినందనలు తెలుపుతున్నారు.