బొల్లారం, డిసెంబర్ 14 : ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రా ల్లో పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ రూపేశ్ ఆదేశాల మేరకు పారిశ్రామికవాడలో జరుగుతున్న గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందాపై నిఘా పెట్టారు. రెండు రోజుల క్రితం జిల్లా స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు పలు కేంద్రాల్లో జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున 72 డోమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అక్రమ రీఫిల్లింగ్కు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
కాగా గురువారం స్థానిక సీఐ నయీమొద్దీన్ ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ సమీపంలోని పలు కాలనీల్లో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై సిబ్బందితో తనిఖీలు నిర్వహించి పదుల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ సముదాయాల్లో అక్రమ రీఫిల్లింగ్కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని నిర్వాహకులను హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లపై సివిల్ సైప్లె అధికారులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.