చిన్నశంకరంపేట, జూన్ 24: వరుస హత్యలతో సూరారంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జంట హత్యలతో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన శ్రీధర్ను ప్రభాకర్ అనే వ్యక్తి మిత్రులతో కలిసి ఆటోతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు.
ప్రతీకారంగా నిందితుడు ప్రభాకర్ తండ్రి యాదగిరిని శ్రీధర్ బంధువులు హత్యచేసి హల్దీవాగులో పడేసిన విషయం విధితమే. దీంతో గ్రామంలో పోలీసులు రెండు రోజులుగా కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మృతుడు శ్రీధర్ అంత్యక్రియలు మంగళవారం రాత్రి పోలీస్ బందోబస్తు నడుమ జరిగాయి.
బుధవారం యాదగిరి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, గ్రా మంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో పోలీసుల సూచనల మేరకు బంధువులు నర్సాపూర్లో అంత్యక్రియలు ని ర్వహించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామం లో పికెటింగ్ కొనసాగుతున్నదని ఎస్సై శివానందం తెలిపా రు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారని ఎస్సై పేర్కొన్నారు.