జహీరాబాద్, అక్టోబర్ 10 : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్పోస్టులు ప్రారంభించారు. తెలంగాణలో ఎన్నికల నోటికేషన్ విడుదల నవంబర్ 3న జారీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సరిహద్దులో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో 65వ జాతీ య రహదారిపై చెక్పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న 65 జాతీయ రహదారిపై చెరాగ్పల్లి, మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ తండా, కోహీర్ మండలంలోని మనియార్పల్లి శివారు, గోటిగార్పల్లి పంచాయతీ పరిధిలోని సిద్దాపూర్తండా, న్యాల్కల్ మండలంలోని బీదర్-జహీరాబాద్ రోడ్డు పై గణేశ్పూర్, శంశోల్లాపూర్, డప్పుర్, హుసేనగర్ శివారులో ఉన్న సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా..
తెలంగాణకు సరిహద్దులో ఉన్న రోడ్లుపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం ప్రారంభించారు. కర్ణాటక రాష్ర్టానికి సరిహద్దులో ఉన్న గ్రామాలకు సమీపంలో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి శాసన సభ ఎన్నికలు ముగిసే వరకు వాహనాలు తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేరాస్తుల కదిలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ర్ట వైపు నుంచి నగదు, మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు తెలంగాణ వైపు రాకుండా నివారణ చర్యలు తీసుకోనేందుకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు చెక్పోస్టులో తహసీల్దార్, ఎస్సై స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేసేందుకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దులో బీదర్, చించొళి, హుమ్నాబాద్ తాలుక కేంద్రాలు ఉన్నాయి. అక్కడి పోలీసు అధికారులతో ప్రతి సమాచారం సేకరించి సమన్వయంతో పని చేసేందుకు జహీరాబాద్ పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
శాసన సభ ఎన్నికలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 313 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,64, 732 లక్షల ఓటర్లు ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పోలింగ్ కేం ద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేశా రు. పాత నేరాస్తులు, రౌడీ షీటర్లు కదిలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
అక్రమ రవాణాకు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు..