ఆదివారం బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మోసపూరితమైన హామీలిచ్చి గద్దెనెక్కిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.