మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 2017-18 నుంచి 2019-20 వరకు పెండింగ్లో గల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరికై ఈనెల 18వ తేదీలోగా ఉపకార వేతనాల దరఖాస్తులను సంబంధిత అథికారులకు సమర్పించాల్సిందిగా జిల్లా ఆదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 2017-18 నుంచి 2019-20 వరకు పెండింగ్లో గల ఉపకార వేతనాల చెల్లింపుల్లో ఏవైన అభ్యంతరాలు ఉంటే అధికారులను సంప్రందించి సరి చేసుకోవాలని, లేనిచో తదుపరి చర్యకు మీరే బాధ్యత వహిచాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫిరంగి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.