మెదక్, ఫిబ్రవరి 9 : గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫోజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎంఎ రజాక్ తెలిపారు.
బుధవారం అతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రూప్సింగ్ తన కారులో మూడు కిలోల అల్ఫోజోమ్ను గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన మెదక్ జిల్లా పరిధిలోని కాళ్ళకల్ ప్రాంతంలో విక్రయిస్తుండగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇదిలావుండగా బుధవారం అతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో మత్తు పదార్ధాలతోపాటు గంజాయిని ఎవరైనా విక్రయించినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఇప్పటికే గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.