పటాన్చెరు, డిసెంబర్ 22: అందరి ఆశీస్సులతో మళ్లీ గెలిచానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తన హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యతను పెంచిందన్నారు. సీఎంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతతో పని చేస్తానన్నారు.
బీఆర్ఎస్లో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి గురించి తనకు తెలుసన్నారు. ప్రతి మూడు నెలలకు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు గాలి అనిల్కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు రంగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించారు. బీఆర్ఎస్ నాయకులు సఫానదేవ్, శంకర్యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, దేవానందం, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, మున్సిపల్ చైర్మన్ లలితాసోమిరెడ్డి, పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పనగేశ్యాదవ్, వైస్ చైర్మన్ రాములుగౌడ్ పాల్గొన్నారు.