పటాన్చెరు, మార్చి 10: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం పెట్టుకొని చదవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులు 5వేల మందికి స్టడీ మెటీరియల్ అందజేశారు. ప్రముఖ మానసిక వ్యక్తిత్వ నిపుణులు డాక్టర్ సతీశ్తో మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నదని, సీఎం కేసీఆర్ సర్కారు బడులను బలోపేతం చేశారన్నారన్నారు. నాణ్యమైన విద్యకు ఇప్పుడు సర్కారు బడులే ముందున్నాయన్నారు. మనఊరు-మనబడి ద్వారా వేలాది బడులను మరమ్మతులు చేసి బాగు చేసుకున్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు లభించడం కష్టంగా మారిందని తెలిపారు. చక్కటి విద్యాబోధనతో సర్కారుబడులు రానిస్తున్నాయన్నారు. నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులందరికీ సొంత ఖర్చుతో విలువైన సమాచారంతో కూడిన స్టడీ మెటీరియల్ను, పరీక్ష సామగ్రిని ఇస్తున్నామని తెలిపారు. పరీక్షలు పూర్తి అయ్యేవరకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే విద్యార్థులను కోరారు. పది పాస్ అవుతేనే ప్రొఫెషనల్గా ముందుకు వెళ్తారన్నారు.
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి : డాక్టర్ సతీశ్, మానసిక, వ్యక్తిత్వ నిపుణుడు
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు మానసిక, వ్యక్తిత్వ నిపుణుడు డాక్టర్ సతీశ్ సూచించారు. ఇష్టపడి చదివితే అన్ని పరీక్షలు పాస్ అవుతారన్నారు. జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే అన్ని అవరోధాలను తేలిగ్గా దాటవచ్చన్నారు. సమయ పాలన జీవితంలో కీలకం అన్నారు. మొబైల్, టీవీలు వాడరాదని, ఫంక్షన్స్ వెళ్లరాదని సూచించారు. అధైర్యపడకుండా పరీక్షలు రాయాలని చెప్పారు. అనంతరం రెండో సెషన్లో ప్రైవేటు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, డీఈవో నాంపల్లి రాజేశ్, డీఆర్డీఏ అధికారి శ్రీనివాస్రావు, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, కొలన్బాల్రెడ్డి, వెంకటేశంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎంఈవో పీపీ రాథోడ్, దశరథరెడ్డి, బీ వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.