పటాన్చెరు, జూలై 12: గొల్లకురుమల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం నందిగామలో రెండోవిడుత గొర్రెల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే గొల్లకురుమలకు కేటాయించిన 12 సబ్సిడీ గొర్రెపిల్లల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, గొల్కొండ లక్ష్మణ్ పాల్గొన్నారు.