పటాన్చెరు, నవంబర్ 30: రెవెన్యూ సదస్సులు భూ సమస్యలను పరిష్కరిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్లో ఏర్పాటు చేసిన రెవన్యూ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ద్వారా 90శాతం సమస్యలను పరిష్కరించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలను అద్భుతంగా అమలు చేస్తున్నదన్నారు. తహసీల్దార్ పరమేశ్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ధరణి పోర్టల్పై ఎవరికైనా సందేహాలుంటే వాటిని తీరుస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కుమార్, ఆర్ఐలు పాల్గొన్నారు.