నర్సాపూర్, మే 4: మద్యం తాగి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపించడంతో భయాందోళనలు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్రీతింగ్ పరీక్షలు చేసిన నర్సాపూర్ పోలీసులు సోమవారం బస్సును నర్సాపూర్ బస్టాండ్లో నిలిపివేశారు. వివరాల్లోకెళితే.. మేడ్చల్ నుంచి నర్సాపూర్కు వస్తున్న బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తిరుమలేశ్ బస్సులోని ప్రయాణికులపై చిరాకుపడుతున్నాడు.
దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నాడని గుర్తించారు. వెంటనే నర్సాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ పరీక్షలు చేశారు. మద్యం తాగినట్లు గుర్తించారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రైంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ పోలీసులు తెలిపారు.