దుబ్బాక టౌన్, మార్చి 13: మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావుకు అవకాశం దక్కింది. బుధవారం సాయం త్రం రెండో జాబితాలో రఘునందన్రావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. రఘునందన్రావు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2018లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోగా, ఆయన అనారోగ్యంతో 2020లో మరణించాడు.
అదే సంవత్సరం నవంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన రఘునందన్రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. రఘునందన్రావు 2014, 2018 ఎన్నికల్లో సైతం బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.