వాడవాడలా ప్రగతి పనులు
రోడ్లు, మురుగుకాల్వలు శుభ్రం
ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
రోడ్లకిరువైపులా హరితహారం మొక్కలు..
ఐదో రోజూ కొనసాగిన పల్లె, పట్టణ ప్రగతి
విద్యుత్ సమస్యలు పరిష్కారం
శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూల్చివేత, పురాతన బావుల పూడ్చివేత
వాడవాడలా ‘ప్రగతి’ పనులు ఊపందుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛ పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటకు విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, క్రీడాప్రాంగణాలను పరిశీలించారు. మనోహరాబాద్ మండలం పోతారంలో జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్ శ్రమదానం చేశారు. గౌతోజిగూడెంలో హరితహారంలో భాగంగా వైకుంఠధామంలో మొక్కలు నాటారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ పట్టణంలోని 26, 27 వార్డుల్లో సమస్యలను తెలుసుకున్నారు.
మెదక్/సంగారెడ్డి, న్యూస్ నెట్వర్క్: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్రీడాప్రాంగణాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు తదితర పనులు చేస్తున్నారు. పారిశుధ్య సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ప్రగతి పనుల్లో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా నిర్వహిస్తున్నారు. పరిసరాల శుభ్రత పాటిస్తే రోగాలు దరి చేరవు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలి. వార్డుల్లో కలుపు మొక్కలు తొలగించారు. మురుగు కాల్వలు, కాలనీల్లోని చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. నీటి లీకేజీ సమస్యలను గుర్తించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిశీలించారు. వానకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విరిగి, తుప్పుపట్టి మరమ్మతులకు నోచుకోని విద్యుత్ స్తంభాలు తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి. వాటిని సంరక్షించాలని కోరారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఏయే మొక్కలు పెంచుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
బొలారం: బాలాజీనగర్లోని విద్యుత్ సమస్యలను ఏఈకి వివరిస్తున్న వార్డు కౌన్సిలర్ సుజాత మహేందర్రెడ్డి
మెదక్ రూరల్: పాతూరు లో క్రీడా మైదానం కోసం గుట్టలను ,జేజీబీ సహాయంతో తొలిగించి, చదునుచేయిస్తున్న టీఆర్ఎస్ నాయకులు బాలయ్య ,శ్రీనివాస్
రామాయంపేట: తొనిగండ్లలో మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని తొలగిస్తున్న గ్రామస్తులు