సెలవురోజూ ఉత్సాహంగా కొనసాగిన ‘ప్రగతి’ పనులు
క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
పారిశుధ్య సిబ్బంది, స్థానికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
‘మనఊరు – మనబడి‘ పనులపై ఆరా..
నర్సరీల్లో పెంచుతున్న మొక్కల పరిశీలన
క్రీడాప్రాంగణాల నిర్మాణం వేగవంతం
మెదక్/ సంగారెడ్డి, న్యూస్నెట్వర్క్, జూన్12 : గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10వ రోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బృహత్ ప్రకృతి వనాలను సందర్శించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను, చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. గ్రామాల్లోని వీధులు శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికులతో మురుగు కాల్వలు తీయించారు. పలు గ్రామాల్లో యువకులు, మహిళలు శ్రమదానం చేసి, పరిసరాలను పరిశుభ్రంగా చేశారు.
వెల్దుర్తి: ఉప్పులింగాపూర్లో రోడ్లను శుభ్రం చేస్తున్న మెదక్ జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్
జిన్నారం: లక్ష్మీపతిగూడెంలో పాత ఇండ్లను జేసీబీతో తొలిగిస్తున్న పంచాయతీ కార్యదరి, సిబ్బంది
మెదక్ మున్సిపాలిటీ: మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
రామాయంపేట: పట్టణ ప్రగతిలో మురుగు కాల్వలు తీయిస్తుతన్న కౌన్సిలర్ దేమె యాదగిరి