బచ్చన్నపేట, అక్టోబర్ 29 : సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, బీఆర్ఎస్ను ఆదరించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇటికాలిపల్లి, రామచంద్రాపూర్, కొన్నె, దబ్బగుంటపల్లి, లింగంపల్లి, మన్సాన్పల్లి, సాల్వాపూర్ గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లాకు ప్రతి పల్లెలో ప్రజలు ఘనస్వాగతం పలికి నుదుట తిలకం దిద్ది మేమున్నామని భరోసా ఇచ్చారు. ఇటికాలపల్లిలో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో ఆయన పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అరవై ఏండ్లకు పైగా తెలంగాణను పాలించిన ఆంద్రోళ్లు మన ప్రాంతానికి చేసిందేమీలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్రం సాధించారన్నారు. అప్పటి నుంచి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే పనిలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. దశలవారీగా అభివృద్ధి పనులు చేసుకుంటూ ఆర్థికంగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తాము స్వయంగా గుర్తించామన్నారు.
జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ పింఛన్లు ఇప్పిస్తామని, భూమి ఉన్న వాళ్లకు రైతుబీమా, భూమి లేని వాళ్లకు కేసీఆర్ బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఆసరా పింఛన్లు పెంచుతామని, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు అందించేందుకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను రూపొందించారని తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు సొంత భవనాలు నిర్మించే విధంగా కృషి చేస్తామన్నారు. పంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనగామ ప్రజలకు సేవలు చేస్తానని, ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మసీదుల్లో ప్రార్థనలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటికాలపల్లి, కొన్నె గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రజితావెంకట్రెడ్డి, దూడల కనకయ్య, సుంకె లక్ష్మి, చంద్రమౌళి, ఇంద్రారెడ్డి, నాగరాజు, వేముల వెంకట్, లక్ష్మణ్గౌడ్, వేముల విద్యాసాగర్, ఆంజనేయులు, సిద్ధారెడ్డి, శివకుమార్, మల్లేశం, లతాశ్రీతిరుపతిగౌడ్, మద్దికుంట రాధ, భాస్క ర్, రమేశ్, తార శ్రీధర్, జనార్దన్, పరమేశ్వర్రెడ్డి, కీసర లక్ష్మి, బాగులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోడిగం చంద్రారెడ్డి, నాయకులు ఉపేందర్రెడ్డి, షబ్బీర్, జావీద్, బాల్రెడ్డి, చల్లా శ్రీనివాస్రెడ్డి, మల్లవరం వెంకటేశ్వర్రెడ్డి, రాములు, అశోక్, కిష్టయ్య, ఆంజనేయులు, కొండి వెంకట్రెడ్డి, చంద్రమౌళి, ఆజీం, బాలరాజు, మధుప్రసాద్, సిద్ధిరాములు, నర్సమ్మ, నర్సింహులు, పడిగెల కరుణాకర్రెడ్డి, గీస ప్రకాశ్, ముశిని రాజుగౌడ్, స్వామి, రవీందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. గ్రామాల పొలిమెర్లలోనే ఆయనకు డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు విన్యాసాలు, కోలాటం, బతుకమ్మ, బోనాలతో పల్లాకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి నుదుట తిలకం దిద్దారు. ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తుండగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏ ఊరుకెళ్లినా గులాబీ జెండాకే మా ఓటు అని ఓటర్లు హామీ ఇస్తున్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానని చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఐదేండ్లు సేవ చేసే భాగ్యం కలిగించాలని ఓటర్లను పల్లా వేడుకున్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. గ్రామీణ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
నర్మెట, అక్టోబర్ 29 : మండలంలోని వివిధ పార్టీల నుంచి సుమారు 30 మందికిపైగా సర్పంచ్ ముప్పిడి లక్ష్మీప్రతాప్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేడబోయిన రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్లో చేరినవారిలో బీజేపీ మండల ప్రధాన క్యాదర్శి తోకల శేఖర్, కార్యకర్తలు మార్క కృష్ణ, బొడ్డు ప్రేమ్కుమార్, రాజబోయిన రాజ్కుమార్, అనిల్, రాకేశ్, శ్రావణ్, సాయికుమార్, శేఖర్, రమేశ్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొన్నబోయిన రాజ్కుమార్, నర్మెట సోషల్ మీడియా అధ్యక్షుడు నక్క సుధాకర్, నర్మెట మండల ఉపాధ్యక్షుడు మార్క రమేశ్, పిట్టల స్వామి, రాజబోయిన శ్రీధర్, బోయిని భాస్కర్, పిట్టల కార్తీక్, గౌరబోయిన కరుణాకర్, శ్రీకాంత్, రాజు, శ్రీను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పెద్ది రాజిరెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, నర్మెట సర్పంచ్ కమలాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బుడ్డ స్నేహలతాభాస్కర్, నాయకులు గోగు గట్టయ్య, ముడికె గట్టుమల్లయ్య, గోగు నాగరాజు, మార్క గణేశ్ తదితరులు పాల్గొన్నారు.