చిన్నశంకరంపేట, మార్చి30: తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామారంలో రూ.12 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్.ముత్యంరెడ్డి స్మారకార్థం రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనం, రూ.5 లక్షలతో నిర్మించనున్న ముదిరాజ్ సంఘ భవనానికి ఆమె శంకుస్థాపన చేశారు.
మాజీ ఎమ్మెల్యే ఆర్.ముత్యంరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డీ విరుస్తున్నదని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా116లు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లోరి మాధవి, మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, సర్పంచ్లు పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎస్.శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ సెల్ నాయకుడు ఏదుల్ నాయకులు కుమార్గౌడ్, సిద్దాగౌడ్, శ్రీనివాస్ శంకరయ్య, శ్రీను దుర్గపతి మండంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.