మెదక్/ రామాయంపేట, డిసెంబర్ 2 : ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత ఇస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేం ద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ నియోజక వర్గంలోని 89 మంది లబ్ధ్దిదారులకు రూ.29.43 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పాపన్నపేట మండ లానికి సంబంధించిన రూ.7,00,812 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కు లతోపాటు రూ.6.50 లక్షల విలువైన ఎల్వోసీ మంజూరు చేయించారు. పేదలు అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందితే.. సరైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే సీఎం సహయనిధి నుంచి ఆర్థికసాయం అంద జేస్తామన్నారు.
పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తు న్నదన్నారు. చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ప్రశాంత్రెడ్డికి రూ.2.50లక్షలు, మెదక్ మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజాపాషా రూ.2.50 లక్షలు, శివాయపల్లి గ్రామానికి చెందిన వైష్ణవికి రూ.1.50 లక్షలు విలువజేసే సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పత్రాల ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, కిష్టయ్య, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లోరి రాజు, వైస్ ఎంపీపీలు విష్ణవర్ధన్రెడ్డి, సుజాత, నాయకులు రాగి అశోక్, సంజీవరెడ్డి, యాదగిరి, సాంబశివరావు, కిషన్, శ్రీనివాస్, సుభాశ్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు జగన్, గురుమూర్తిగౌడ్, మల్లేశం, ప్రభాకర్, మల్లేశం పాల్గొన్నారు.
మెదక్ క్యాంపు కార్యాలయంలో రామాయంపేట మం డలానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి అందజేశారు. కోనాపూర్కు చెందిన బుచ్చిరెడ్డికి రూ.56వేలు, సంజీవరెడ్డికి రూ.39వేలు, డి.ధ ర్మారం గ్రామానికి చెందిన కరికె శ్రీకాంత్కు రూ.60వేలు, ఝాన్సీలింగాపూర్కు చెందిన వడ్ల లక్ష్మికి రూ.24వేలు, దూదేకుల జులేఖకు రూ.24 వేలు, శివ్వాయపల్లెకు చెందిన రవీందర్కు రూ.20 వేలు, లాక్యా తండాకు చెందిన రవికి రూ.32 వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమం లో రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు ఇమ్మానియేల్, సంజీవరెడ్డి, మల్లే శం, మహేశ్, సుభాష్ రాథోడ్, సిద్ధిరాంరెడ్డి, శంకర్ ఉన్నారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్ పథ కం వరమని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బాల్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం చల్మెడలో బాధితురాలు శ్యామలకు రూ.14వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రావుల బాబుతో కలిసి అందజేశారు.
మండలంలోని లక్ష్మీనగర్ శి వారులో నిర్మించిన ఎస్ఆర్ ఫంక్షన్హాల్ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనురాధాఏడుకొండలు, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు బాపురావు, మహేశ్ పాల్గొన్నారు.