చేర్యాల, డిసెంబర్ 11: కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తు లు తరలిరావడంతో మల్లన్న క్షేత్రంలో సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి 10వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. మల్లన్నకు తమ మొక్కులు చెల్లించేందుకు శనివారం సాయంత్రం నుంచే భక్తులు కొమురవెల్లికి చేరుకున్నారు. శనివారం కొమురవెల్లిలో బస చేశారు.
ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో స్నానం చేసి, క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తు లు అర్చన ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు మహామండప, చిలుకపట్నం, బోనం సమర్పించి హుండీలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నా రు. మరికొంత మంది తమకు సంతానం కావాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి, ఒల్లు బండ వద్ద పూజలు చేశారు. మల్లన్నకు కోడెను కట్టి కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ధర్మకర్తలు కొం గరి గిరిధర్, సూటిపల్లి బుచ్చిరెడ్డి, నర్ర రఘువీరారెడ్డి, కనకరాజు, కందుకూరి సిద్ధిలింగం, చెట్కూరి తిరుపతి, సాయియాదవ్, నామిరెడ్డి సౌజన్య, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాసశర్మ, ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.