మెదక్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన medicineఅందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి జిల్లా దవాఖానను ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, ల్యాబ్లు, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. థియేటర్లో ఆపరేషన్కు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కండిషన్లో ఉండాలని, సాంకేతిక సిబ్బంది సకాలంలో వచ్చేలా చూడాలన్నారు. రికార్డులను పరిశీలించి, ఇన్, అవుట్ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
కొందరికి అల్పాహారం అందకపోవడంతో నర్సులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రోగులకు అల్పాహారం, భోజనం అందించాలని, ప్రతి వార్డులో మెనూ ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న డయాలసిస్ సెంటర్ భవనాన్ని తక్షణమే డిస్మెంటల్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జూన్ లోపు వాటర్ లీకేజీలు అరికట్టాలన్నారు. దవాఖాన మొదటి అంతస్తులో చిన్న పిల్లలకు వైద్యం అందించేందుకు నిర్మించే ఎర్లీ డిటెక్షన్ సెంటర్ స్థలాన్ని సందర్శించారు. టెండర్లు ఆహ్వానించి, పనులు మొదలు పెట్టాలని టీఎస్ ఎండీసీ ఈఈ రవీందర్రెడ్డికి సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్, ఈఈ రవీందర్రెడ్డి ఉన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు పూర్తి చేయాలి
నర్సాపూర్, మే4: డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో మిగిలిపోయిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం నర్సాపూర్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సాపూర్లోని 252 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కిటికీలు, ఎలక్ట్రిఫికేషన్, పెయింటింగ్, ప్లంబింగ్ వంటి మిగిలిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తూ, మౌలిక సదుపాయాలతో పాటు పరిసర ప్రాంతాలను చదును చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ఆయనతో పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో మార్టీన్ లూథర్, కాంట్రాక్టర్లు ఉన్నారు.