మెదక్ మున్సిపాలిటీ: కరోనా సంక్షోభ సమయంలోనూ డిజిటల్ తరగతులతోనే విద్యాబోధన కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వ హణ అత్యంత పకడ్బందీగా కొనసాగుతుండటంతో పాటు విద్యార్థులు హాజరు శాతం పెంచేందుకు విద్యాశాఖ అధికారులు తీసుకుటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లాలో డిజిటల్ తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతొంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 924 ఉన్నాయి. ఇందులో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 67,649 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తుంది. ప్రతి రోజు డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఈనెల 16న అత్యధికంగా 49,805 (73.62శాతం) మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షీంచినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభమవగా తొలిరోజు 45,233 మంది విద్యార్థులు తరగతులు వినడం గమనర్హం. జూలై 1 నుం చి ఇప్పటి వరకు సరాసరిగా 73.62 శాతం విద్యార్థులు డిజిటల్ తరగతులు వింటున్నారు.
పెరుగుతున్న విద్యార్థుల హాజరు శాతం..
విద్యా శాఖ నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు సంబంధించి విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలతో రోజురోజుకూ విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. జిల్లా పరిధిలో మొత్తం సర్కార్ బడు లు 923 ఉండగా పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 67,649 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రోజురోజుకూ డిజిటల్ తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యా శాఖ తీసు కుంటున్న చర్యలతో విద్యార్థుల హాజరు పెరుగుతోంది. ఈనెల 16వ తేది సోమవారం డీడీ యాదగిరి, టీశాట్, ఇతర టీవీల ఛానల్స్ ద్వారా డిజిటల్ తరగతులకు 32,158 మంది విద్యార్థులు హాజరు కాగా, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ద్వారా 14,681మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షించారు.
జిల్లా పరిధిలో టీశాట్ యాప్ను 18,547మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. మరోవైపు విద్యార్థులు డిజిటల్ తరగతులకు హాజరవుతున్నారా లేదా పరిశీలనకు విద్యా శాఖ వివిధ మార్గాల ద్వారా పర్యవేక్షిస్తుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు నేరుగా ఇప్పటివరకు ఫోన్ ద్వారా 2,772 మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులతో మాట్లాడి తెలుసుకున్నారు.
మరోవైపు ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థుల ఇండ్లకు వెళ్లి డిజిటల్ తరగతులకు విద్యార్థులు హాజరును పరిశీలిస్తున్నా రు. ఇప్పటివరకు 787 మంది విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పరిశీలించారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేని విద్యార్థులు తమ ప్రక్కనే గల విద్యార్థుల ఇండ్లలోని టీవీల్లో 3,376 మంది విద్యా ర్థులు డిజిటల్ తరగతులు వింటున్నారు. అంతేగాకుండా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన టీవీల్లో సైతం విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షిస్తున్నారు.
పర్యవేక్షణకు 3,421 వాట్సాప్ గ్రూప్లు
విద్యార్థులు డిజిటల్ తరగతులకు హాజరయ్యేలా అవసరమైన సూచనలు చేసేందుకు ఏ తరగతికి సంబంధించిన ఏ పాఠ్యాంశాలు ఏ సమయంలో ప్రసారమవుతాయనేది విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. 3 నుంచి 10వ తరగతి వరకు జిల్లా వ్యాప్తంగా 3,421 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏ తరగతికి సంబంధించిన ఏ పాఠ్యాంశంలోని ఏ పాఠం ఎప్పుడు బోధిస్తారనేది ఉపాధ్యాయులు తెలియజేస్తారు.
తద్వారా ఆయా సమయాల్లో విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షించనున్నారు. అలాగే ఏదైనా హోంవర్క్ ఉంటే వాటి ని పూర్తి చేసిన విద్యార్థులు వాట్సాప్ గ్రూపులో ఆప్లోడ్ చేస్తారు. తద్వారా మరింత పకడ్బందీగా డిజిటల్ తరగతుల ని ర్వహణ కొనసాగడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెరగడానికి ఈ వాట్సాప్ గ్రూపులు ఎంతో దోహద పడుతున్నాయి
విద్యార్థులు పాఠాలు వినేలా చర్యలు: సుబాశ్ నాయక్, సెక్టోరియల్ అధికారి
విద్యార్థులు డిజిటల్ పాఠాలు వినేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పరిశీలిస్తున్నా రు. వాట్సాప్ గ్రూప్లలో పాఠాలను ఆప్లోడ్ చేస్తున్నాం. సందేహలను అడిగి తెలుసుకుంటున్నాం. ఏ పాఠం ఎప్పుడు బో ధిస్తారనేది సంబంధిత ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులలో విద్యార్థులకు తెలియజేస్తున్నారు. పదో తరగతి విద్యా ర్థులపై ప్రత్యేక దృషి పెట్టాం. పకడ్బందీగా డిజిటల్ తరగతుల నిర్వహణ కొనసాగడంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది.