సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 28 : సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఐదోరోజు బుధవారం పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1231 మంది అభ్యర్థులకు, 992 మంది ఈవెంట్స్లో పాల్గొనగా.. 386 మంది అభ్యర్థులు తుది పరీక్షకు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. పరీక్షలు జరిగే పరిసరాలను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంచినట్లు చెప్పారు.
ఇందుకోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈవెంట్స్ పూర్తయ్యేంత వరకు మానిటర్ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు అడ్మిన్ రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, సంగారెడ్డి డీటీసీ డీఎస్పీ జనార్దన్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు