మెదక్ మున్సిపాలిటీ, మార్చి 21: మూడో రోజు గురువారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 10,298 మంది విద్యార్థులకు 10,278 మం ది హాజరు కాగా, 20 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాధాకిషన్ తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులు 12 మందికి 11 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో విద్యార్థుల హాజరు 99.81 శాతంగా నమోదైనట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ రాహుల్రాజ్ సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. శివ్వంపేట, నర్సాపూర్, టేక్మా ల్, పాపన్నపేట మండలాల్లోని 9 పరీక్ష కేంద్రాలను డీఈవో రాధాకిషన్ సందర్శించారు. అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట మండ ల కేంద్రాల్లోని 15 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్ బృందం తనిఖీలు చేసింది. జిల్లాలో ఎక్కడా డిబార్ లేదా మాల్ప్రాక్టీస్పై ఫిర్యాదులు రాలేదని డీఈవో రాధాకిషన్ పేర్కొన్నారు.
పాపన్నపేట, మార్చి 21 : పార్టమెంట్ ఎన్నిక ల్లో నగదు, మద్యం పంపిణీ జరగకుండా ఎస్ఎస్టీ బృందాలు ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో భాగంగా పాపన్నపేట శివారులోని పోలీస్ చెక్ పోస్టును ఆర్డీవో రమాదేవితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ సభ్యులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, సీసీకెమెరాల పర్యవేక్షణతోపాటు మెరుగైన పనితీరు కనబర్చాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. పాపన్నపేట మండలం డాక్యాతండాలో పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఉన్నారు.