జిల్లాలో 70 చోట్ల సంవద వనాలు ఏర్పాటు చేసి అల్లానేరేడు, సీతాఫలం, జామ తదితర పండ్ల మొక్కలను నాటనున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వీటిని ప్రభుత్వమే మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేస్తుందని, పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. కొల్చారం మండలంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. వెంకటాపూర్, చిన్నఘనపూర్ గ్రామాల్లో సంపద వనాల కోసం ఎంపిక చేసిన స్థలాలను డీఆర్డీవో శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. కొల్చారంలోని ఆగ్రో సేవాకేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న టీఎల్ఎం శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. మనఊరు-మనబడి కింద అసంపూర్తి పనులను సెప్టెంబర్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
– కొల్చారం, ఆగస్టు 8
కొల్చారం, ఆగస్టు 8: కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో మెదక్ కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. వెంకటాపూర్, చిన్నాఘన్పూర్ గ్రామాల్లో సంపద వనాలు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని డీఆర్డీవో శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. వెంకటాపూర్లో కలెక్టర్ స్థానిక సర్పంచ్ నెల్లి కిష్టయ్యతో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు. చిన్నాఘన్పూర్ ఇన్స్ఫెక్షన్ బంగ్లా ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న సంపద వనాలకు సంబంధించి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించి, ఏయే మొక్కలు నాటాలో వివరించారు. కొల్చారం బస్టాపు సమీపంలోని ఆగ్రో సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత కొల్చారం పాఠశాల సముదాయంలో జరుగుతున్న టీఎల్ఎం శిక్షణా శిబిరాన్ని పరిశీలించారు. గతంలో కంటే ఇప్పుడు ఉన్న బోధనోపకరాణాల ద్వారా బోధన సులభతరమవుతుందని, అర్థమయ్యే విధానంలో విద్యార్థులకు బోధన చేయాలని సూచించారు. ‘మనఊరు-మనబడి’ కింద అసంపూర్తిగా ఉన్న పనులను సెప్టెంబర్ 10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో 70 సంపద వనాలు : మెదక్ కలెక్టర్ రాజర్శి షా
తెలంగాణకు హరితహారంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నీటిపారుదలశాఖ స్థలాల్లో దశాబ్ది సంపద వనాలు జిల్లా స్థాయిలో 70 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈజీఎస్, అటవీశాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు టీంలుగా ఏర్పాటై వీటిని అభివృద్ధి చేస్తారన్నారు. సంపద వనాల్లో అల్లనేరేడు, సీతాఫల్, జామ తదితర పండ్ల మొక్కలను నాటి ప్రభుత్వమే మూడు సంవత్సరాలపాటు మెయింటెనెన్స్ చేస్తుందన్నారు. సంపద వనాలను పెంచడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో 36 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 75శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి దశాబ్ది ఉత్సవాలు ముగింపు రోజు ప్రతి గ్రామ పంచాయతీలో 750 మొక్కల చొప్పున నాటాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా అటవీశాఖాధికారి రవిప్రసాద్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఈఈలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ కిశోర్, ఎంఈవో నీలకంఠం, సర్పంచ్లు నెల్లి కిష్టయ్య, ఇందిరా ప్రియదర్శినీ, కరెంటు ఉమాదేవి, ఏపీవో మహిపాల్రెడ్డి, మండల వ్యవసాయాధికారి శ్వేతకుమారి, ఎఫ్ఆర్వో మనోజ్కుమార్, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్లు శ్రీహరి, జలీల్ అహ్మద్, సహాయ ఇంజినీర్లు ఇర్ఫాన్ హుస్సేన్, మహేశ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.