మెదక్, మే 28 (నమస్తే తెలంగాణ): జూన్ 2 నుంచి చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో గడిచిన తొమ్మిది ఏండ్లల్లో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, ఇందుకోసం 21 రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చకటి కార్యాచరణతో అవతరణ వేడుకల్లో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్ 2నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని, 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో రోజుకో కార్యక్రమం చొప్పున జూన్ 22 వరకు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా షెడ్యూల్ ప్రకటించిందన్నారు. ఉత్సవాల్లో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారు లతో కలిసి పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి, విజయవంతం చేయాలని కోరారు.
మెదక్, మే 28 (నమస్తే తెలంగాణ): జూన్ 2 నుంచి చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో గడిచిన తొమ్మిది ఏండ్లల్లో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, ఇందుకోసం 21 రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చకటి కార్యాచరణతో అవతరణ వేడుకల్లో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్ 2నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని, 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో రోజుకో కార్యక్రమం చొప్పున జూన్ 22 వరకు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా షెడ్యూల్ ప్రకటించిందన్నారు. ఉత్సవాల్లో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి, విజయవంతం చేయాలని కోరారు.
ప్రగతి ప్రతి ఒక్కరికీ తెలిసేలా..
9 ఏండ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురొని నేడు దేశం గర్వించదగ్గ స్థాయిలో అన్ని రంగాల్లో పురోగమించామని మంత్రి హరీశ్రావు అన్నారు. జూన్ 2న పతాకావిషరణ, దశాబ్ది ఉత్సవ సందేశంతో ప్రారంభమై జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, స్థూపం ఆవిషరణతో ముగిస్తుందన్నారు. 20 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒకరికీ తెలిసేలా వెలుగెత్తి చాటాలన్నారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొకసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలన్నారు. నూతన మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందన్న విషయాన్ని అవగతం చేయాలన్నారు. ఒకో గ్రామానికి అందుతున్న రైతుబంధు, రైతు బీమా, వివిధ రకాల పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, చెరువులో చేప పిల్లలు వదలడం, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, గ్రామాల్లో చెక్ డ్యాములు, ఊట చెరువుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు విద్యుత్తు వెలుగులు చిమ్ముతూ 9 ఏండ్లలో సాధించిన ప్రగతిని గర్వంగా చాటుకుంటూ, ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన పనుల వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని, ప్రభుత్వం నిర్ణయించి లక్ష రూపాయలు ఇవ్వనుందన్నారు. అర్హులైన గిరిజనులకు పోడు భూముల హకు పత్రాలు ఇవ్వనున్నామని, అర్హత గల వారికి ఇంటి స్థలాల పట్టాలు అందజేయాలని తెలిపారు. జూన్ 19న జరిగే తెలంగాణ హరితోత్సవంలో పెద్ద ఎత్తున మొకలు నాటాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్య కోసం జరుగుతున్న కృషిని, మనఊరు-మనబడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయస్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు.
అర్హులకు పట్టాలు ఇవ్వాలి..
జూన్ 24 నుంచి 30 వరకు అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని, జులై మొదటి వారంలో దళిత బంధు యూనిట్లు గ్రౌండింగ్, ప్రతి నియోజకవర్గంలో సొంత జాగా ఉన్న 3 వేల మందికి ఆర్థిక సాయం అందించి ఇండ్లు ప్రారంభించడం, కొత్త సభ్యత్వాలు తీసుకున్న మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి అసైన్డ్ ల్యాండ్ వారసత్వ మార్పు చేసి అర్హత పొందేవిధంగా చూడాలన్నారు. పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపని వాటిని గుర్తించి లే అవుట్ చేసి నంబరింగ్ ఇవ్వాలన్నారు. సంక్షేమ సంబురాల్లో భాగంగా 2వ విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. ఏ ఒక ఆరోగ్య ఉప కేంద్రం అద్దె భవనాల్లో, శిథిల భవనాల్లో ఉండకుండా అన్నిటి ప్రతిపాదనలు పంపితే, మూడు మాసాల్లోగా నిర్మాణాలు గావించాలన్నారు. మనఊరు-మనబడి పనుల్లో ఉమ్మడి జిల్లా ముందున్న పనులు మరింత వేగవంతం చేసి విద్యా దినోత్సవం నాడు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 70 శాతం మేర ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూరయ్యిందని, ఇప్పటి వాకు 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సోమవారం పౌర సరఫరాల సంస్థ చైర్మన్, కమిషనర్లను జిల్లాకు పంపి మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి వేగవంతానికి ఆదేశాలిస్తామన్నారు.
ఉత్సవాల్లో అభివృద్ధిని స్పృశించాలి..
ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో 9 ఏండ్ల అభివృద్ధిని సృ్పశిస్తూ ఉపన్యాసం ఉండాలని, త్వరగా కార్యక్రమాన్ని ముగించాలని మంత్రి హరీశ్రావు సూచించారు. 3న అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరుపాలని, ప్రతిచోట కనీసం వెయ్యి మంది రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను, ముందస్తు పంట వేయాల్సిన ఆవశ్యకతను తెలపాలన్నారు. 4న పోలీస్శాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్, 5న విద్యుత్ విజయోత్సవం, 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. ఉత్సవాల సమయంలో చెరువుల వద్ద ప్రమాదాలకు ఆసారం లేకుండాజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ తాగునీళ్ల పండుగ, 19న హరితోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొకలు నాటాలన్నారు. 20న తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో జెండాను ఎగురవేయాలని, విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయాలని, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలన్నారు. మనఊరు-మనబడి పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రారంభించాలన్నారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. 22న పల్లెలు, పట్టణాల్లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మూడు వారాల పాటు కొనసాగే దశాబ్ది ఉత్సవాల్లో అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తూ, కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో మెదక్, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు హేమలతా శేఖర్గౌడ్, రోజాశర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, ప్రశాంత్ జీవన్ పాటిల్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు సైదులు, యాదవరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు మెదక్ పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ మదన్రెడ్డి, జహీరాబాద్ మాణిక్రావు, అందోల్ చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ భూపాల్రెడ్డి, హుస్నాబాద్ సతీశ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జిల్లా వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.