గ్రామగ్రామాన గులాబీజెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం పండుగలా నిర్వహించారు. జై బీఆర్ఎస్.. జై భారత్..జై కేసీఆర్ నినాదాలతో ఊరూవాడ మార్మోగాయి. బైక్ ర్యాలీలు, పటాకుల మోత, స్వీట్ల పంపిణీతో సందడి నెలకొన్నది.నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జిల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశాలకు గ్రామాలు, మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, మూడోసారి బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వివరించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. తెలంగాణపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. తొమ్మిదేండ్లకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. నాడు నెర్రలువారిన భూములు నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యాయన్నారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సమక్షంలో అన్నారం, కానుకుంట కాంగ్రెస్ నాయకులు వందల సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. – సంగారెడ్డి/మెదక్ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 25
పటాన్చెరు, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ పార్టీకి పటాన్చెరు నియోజకవర్గం కంచుకోట అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ జెండాను గ్రామాల్లో, పట్టణాల్లో ఎగురవేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా భారీగా ర్యాలీలు పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్కు తరలివచ్చాయి. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స మావేశానికి శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భం గా అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్చార్జి సర్పంచ్ మురళి, వందమంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. కానుకుంటకు చెందిన మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా చేస్తున్న కృషితో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరులో అభివృద్ధి అదర్శంగా ఉందన్నారు. తొ మ్మిదేండ్ల కాలంలో రూ. 8వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు నిరంతరం కృషి చేశామని తెలిపారు. 170కి పైగా ఆలయాలు, మసీదులు, దర్గాలు, చర్చిలు నిర్మించి అన్ని మతాల వారికి అండగా నిలిచామన్నారు. ఐనోల్ వద్ద హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మతాల వారికి 5 ఎకరాల చొప్పున భూమి కేటాయించామని తెలిపారు. పటాన్చెరు, పాటి, జిన్నారం, అమీన్పూర్లో స్టేడియాలను నిర్మిస్తున్నామన్నారు. త్వరలో పటాన్చెరులో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఖాయం
మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఖాయమని శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం పేదప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. పటాన్చెరులో అభివృద్ధి అద్భుతంగా ఉందని కొనియాడారు.
సమావేశంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, ఎంపీపీలు దేవానంద్, సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, ప్రవీణాభాస్కర్రెడ్డి, కార్పొరేటర్ పుష్పానగేశ్, మున్పిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజాబాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ కుమార్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, వైస్ చైర్మన్లు రాములుగౌడ్, నర్సింహాగౌడ్, స్వప్నాశ్రీనివాస్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, నాయకులు కొలన్ బాల్రెడ్డి, చంద్రారెడ్డి, గోవర్ధన్రెడ్డి, శ్రీశైలంయాదవ్, వెంకటేశంగౌడ్, దివాకర్, ఆదర్శ్రెడ్డి, నగేశ్, భిక్షపతి, రాజన్సింగ్, మెరాజ్ఖాన్, బాల్రెడ్డి, హన్మంతరెడ్డి, వరప్రసాద్రెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, శ్రీరాములు, లియాకత్ అలీ, అశోక్, అశోక్కుమార్, మాణిక్ప్రభు, పరమేశ్, పాండు, రాజు, హుస్సేన్, తులసిరెడ్డి, అజ్మత్, అంజయ్యయాదవ్, యాదమ్మ, గూడెం మధుసూదన్రెడ్డి, రామకృష్ణముదిరాజ్, మన్నె రాజు, అక్రం పాషా పాల్గొన్నారు.