మెదక్ రూరల్: ఇందిరాగాందీ అవుట్డోర్ స్టేడియంలోని పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పనులను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పురోగతిలో ఉన్న ఫుట్బాల్ మైదానం పనులను పరిశీలించి త్వరితగతిన వాడుకలోకి వచ్చేలా పనులను వేగవంతం చేయాలని, స్టేడియం కలరింగ్ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.
స్పోర్ట్ ఈవెంట్ , ఎక్పైజ్ సేష్టన్ రెండు కలిపి ఒకేరోజు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా రూపాయలు 15లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అథ్లెటిక్ పరికరాలను పరిశీలించారు. మెదక్ పట్టణంలో వృత్తి నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సానుకులంగా స్పందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీమాసింగ్, డీఎస్పీ కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఈ.ఈ. రాం చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, ఆర్డీవో సాయిరాం, కౌన్సిలర్స్ , టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.