సిద్దిపేట, జూలై 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు చెకులు అందినా అవి నగదుగా మారకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ సోమవారం అందజేశారు. దాదాపు సిద్దిపేట నియోజకవర్గంలోని 200 మంది లబ్ధిదారులకు చెక్కలు పంపిణీ చేశారు. వీటిలో కాలపరిమితి ముగిసిన చెక్కులు సైతం ఉండడంతో అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
సిద్దిపేట మున్సిపాలిటీ ఇమాంబాద్ గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు మంత్రి చేతుల మీదుగా చెకు అందుకుని సంతోషంగా బ్యాంకుకు వెళ్తే అకడ ఊహించని షాక్ తగిలింది. చెకుల గడువు ముగిసిందని బ్యాంకు అధికారులు వాటిని తిరసరిస్తుండడంతో పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్యాంకుకు వెళ్తే కాలపరిమితి ముగిసింది, మరో చెక్ రాయించుకోండని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.అధికారులు ఇలా కాల పరిమితి ముగిసిన చెక్కులు అందించడం ఎంత వరకు కరెక్ట్ అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

ఇలా కాల పరిమితి ముగిసిన చెక్కులు ఎన్ని ఉన్నాయో ..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెకులపై ఉన్న చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత వాటిని పంపిణీ చేయడం వల్ల బ్యాంకులు వాటిని నగదుగా మార్చేందుకు నిరాకరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో చెకు చేతిలో ఉన్నా డబ్బు అందని పరిస్థితి నెలకొంది.పెండ్లి ఖర్చుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు ఈ సాయంపై ఆశలు పెట్టుకున్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త చెకులు ఎప్పుడు ఇస్తారు, సమస్య ఎప్పుడు పరిషారం అవుతుందో తెలియక అయోమయంలో ఉన్నామని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గడువు ముగిసిన చెకులను రద్దు చేసి కొత్త చెకులు జారీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను మరింత ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే సమస్య పరిషరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.