నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
నర్సాపూర్, సెప్టెంబర్13 : అక్రమంగా తరలిస్తున్న అరకిలో గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న ఘటన తూప్రాన్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు మోహన్కుమార్, రమేశ్రెడ్డి తెలిపిన వివరాల మేరకు ద్విచక్రవాహనంపై అక్రమంగా ఎండుగంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తూప్రాన్ పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ మెదక్ టీమ్ వాహనాల తనిఖీ నిర్వహించగా మాసాయిపేట్ మండల కేంద్రానికి చెందిన మంగళి రమేశ్ (22) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా 500 గ్రాముల ఎండుగంజాయి దొరికింది.
దీంతో అతడిపై గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తమై ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్కు తరలించి, 500 గ్రాముల ఎండుగంజాయి, బైక్, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 10 వేలు ఉంటుందని సీఐలు మోహన్కుమార్, రమేశ్రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రాజు, హెడ్కానిస్టేబుల్ ఆజామ్స్సేన్, సిబ్బంది గోపాల్, అనిల్, ముల్కయ్య, సతీష్, కరీమ్ పాల్గొన్నారు.