రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోమారం, పెద్దగొట్టిముక్ల, చెన్నాపూర్, చిన్నగొట్టిముక్ల, శివ్వంపేట, చండి గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకానికి రూ. 2060, సాదారణ రకానికి రూ. 2040 మద్దతు ధర కల్పిస్తూ రైతులను ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్, మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీవో నవీన్కుమార్ ఉన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలంలో వెంకటరత్నాపూర్, నాగులపల్లి, తూప్రాన్, బ్రాహ్మణపల్లి గ్రా మాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించా రు. కార్యక్రమంలో రాష్ట్ర సీఎం కేసీఆర్ దళం ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, ఎంపీపీ గడ్డి స్వప్నవెంకటేశ్ యాదవ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ జడ్పీ చైర్ పర్స న్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మ న్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం లోని రంగాయిపల్లి, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, మం డల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి నాయకులు పాల్గొన్నారు.
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కృ షి చేస్తున్నదని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బా ణపురం కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశో క్ అన్నారు. వల్లూర్, శేరిపల్లి, నార్సింగి, నర్సంపల్లిలో ఐకేపీ ఆ ధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలి
ప్రభుత్వం రైతులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఏవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ ఏఈవో రాజశేఖర్ పరిశీలించారు. రైతులు 17శాతం తేమ మించకుండా ఎఫ్సీఐ ప్రమాణాలకనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ప్రభుత్వం అన్నదాతల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నదని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. శుక్రవారం మండలంలోని రజాక్పల్లి, బచ్చురాజ్పల్లి, నిజాంపేట, కల్వకుంట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చి మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి తమ ధాన్యా న్ని కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నిజాంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, కొండల్రెడ్డి, డైరెక్టర్లు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వెంకటే శం, ఏవో సతీశ్, ఏఈవో కావేరి, శ్రీలత, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు ఉన్నారు.
సుతార్పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం..
రైతులకు ప్రభుత్వం భరోసనిస్తున్నదని రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం అన్నారు. మండలంలోని సుతారిపల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య, సీఈవో నర్సింహులు, కార్యదర్శి పద్మ, నాయకుడు మహేశ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మడూర్ సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్రెడ్డి సర్పం చ్ శారద సూచించారు. శుక్రవారం మండలంలోని మందాపూర్ గిరిజన తండాలో మడూర్ సహకార సంఘంఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రసాద్గౌడ్, సింగిల్విండో వైస్ చైర్మన్ యాదగిరి, డైరెక్టర్ సిద్దాగౌడ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బుజ్రాన్పల్లి, జంబికుంట, రామోజీపల్లి గ్రామాల్లో ఐకెపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమే శ్, నాయకులు మానిక్రెడ్డి, సురేశ్గౌడ్, దత్తు, వేణుగోపాల్గౌడ్, సుభాశ్గౌడ్, ఏపీఎం గోపాల్ ఉన్నారు.
నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు
మండలంలోని అచ్చన్నపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ, ఆధ్వర్యంలో ఎంపీపీ చింత స్వప్న రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు శ్వేతాశేఖర్ రెడ్డి, సర్పంచ్ కవిత, మం డల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, టేక్మాల్ ఐకెపీ ఏపీఎం రామకృష్ణ, ఎంపీటీసీలు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలతో రైతులకు భరోసా..
తెలంగాణ సర్కార్ గ్రామ గ్రామాన ఏ ర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు భరో సా కల్పిస్తున్నదని వెల్దుర్తి సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఏదులపల్లిలో సర్పంచ్ భూమయ్య, సీఈవో సిద్ధయ్యలతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రారెడ్డి, మల్లేశం, పోతురెడ్డి, రైతులు పాల్గొన్నారు.