రామచంద్రాపురం, నవంబర్ 24: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్లో ఇప్కో కంపెనీ వారు రైతు అనిల్కు సంబంధించిన పత్తిపంటపై న్యానో యూరియాతో ప్రయోగం నిర్వహించారు. న్యానో యూరియాతో పత్తి పంట ఏవిధంగా పండింది, రైతుకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందని తెలుసుకోవడానికి గురువారం ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ అధికారి కృపాశంకర్ పత్తిపంటను పరిశీలించి రైతు అభిప్రాయం తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లాపూర్లో న్యానో యూరియా పత్తిపంటపై ఏవిధంగా పని చేస్తుందో తెలుసుకోవడానికి రైతు అనిల్ పత్తి పొలంలో ప్రయోగాత్మకంగా యూరియాను నిర్వహించామని తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిందని తెలిపారు. అదేవిధంగా రైతులకు న్యానో యూరియా వాడకం, లాభాల గురించి ఇప్కో అధికారులు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ శ్రీశైలం, ఇప్కో అధికారులు చంద్రన్న, సత్యకృష్ణ, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.