మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, మే 20 : ఇంటర్ పరీక్షలు ముగిశాయి. దీంతో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల ప్రచారం నిర్వహిస్తున్నారు. రండి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి.. అంటూ మెదక్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాల అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రం మెదక్తో పాటు రామాయంపేట, నార్సిం గి, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట, టేక్మాల్ మండలాల్లో ఏర్పాటు చేసిన 45 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలలో చేరాలంటూ ప్రచారం నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూపుల వివరాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సర్వీసులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతన అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులకు విపులంగా వివరిస్తున్నారు.
30న ఆవాస విద్యాలయంలో ప్రవేశ పరీక్షలు
రామాయంపేట పట్టణంలోని వివేకానంద ఆవాస విద్యాలయంలో ఈనెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆవాస విద్యాలయ నిర్వాహకులు తెలిపారు. రామాయంపేటలోని మెదక్ రోడ్డులో దాతల సహకారంతో నిర్మించిన ఆవాస విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన లభిస్తుంద న్నారు. నిరుపేద విద్యార్థులకే ఆవాస విద్యాలయంలో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని ఏ ప్రాంతం వారైనా ప్రవేశ పరీక్షలు రాయవచ్చన్నారు. 3, 4, 5, 6, 7 తరగతులకు సం బంధించిన విద్యార్థులు ఈనెల 30న ఉదయం 11 నుంచి మ ధ్యాహ్నం 1గంటల వరకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థి వెంట వచ్చినవారికి సైతం మధ్యాహ్న భోజన వసతి ఉందన్నారు. పూర్తి వివరాలకు 7386660483 నంబర్కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.