హుస్నాబాద్, ఏప్రిల్ 18: లోక్సభ ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అధికారులకు సూచించారు. గురువారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హుస్నాబాద్ నియోకవర్గ సెక్టోరియల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గంలో 304పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలను ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, వైద్య సదుపాయం, అవసరమైతే చలు వ పందిళ్లు, టెంట్లు వేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హుస్నాబాద్లోని టీఎస్ మోడల్ స్కూల్లో స్ట్రాంగ్రూమ్ ఏర్పాటు చేశామని, త్వరలోనే ఈవీఎంలు కూడా స్ట్రాంగ్రూమ్కు చేరుతాయన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ముందస్తుగానే చేరుకోవాల్సి ఉంటుందని, ఎన్నికల సిబ్బంది ఎన్నికల నియమావళిని అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఓటర్లకు ఏ సమస్య ఉన్నా సీ-విజిల్ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చన్నారు. సీ-విజిల్ వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు రవీందర్రెడ్డి, సంజీవ్కుమార్, సురేఖ, మంజుల, ఎన్నికల డీటీ రుక్మిణి, మహ్మద్ రజాక్, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున నామినేషన్ల దాఖలులో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నిం గ్ అధికారి, ఆర్డీవో రామ్మూర్తి అన్నారు. గురువారం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను ఆర్డీవో, తహసీల్లోని నోటీసు బోర్టులపై ప్రదర్శనకు పెట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉన్నందున నామినేషన్ ఫామ్స్ విషయంలో గానీ ఇతర నిబంధనలలో గానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పా రు. తహసీల్దార్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.