రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సందేశాలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, ఏప్రిల్ 22