మిరుదొడ్డి, నవంబర్ 22: నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురై దవాఖానాలో చికిత్స పొందిన అనంతరం మొదటిసారిగా మంత్రి హరీశ్రావుతో కలిసి బుధవారం మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రాల్లో రోడ్షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కత్తి పోటుకు గురై 15 రోజులు దవాఖానల్లో చికిత్స పొందానని, దుబ్బాక ప్రజల ఆశీర్వాదంతోనే బతికి బయటపడ్డానని ఉద్వేగానికి లోన్య్యారు.
తనకు ప్రజల్లో వస్తున్న ఆధరణను చూసి ఓర్వలేకనే నాపై కత్తితో దాడి చేయించారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలిచి నియోజకవర్గ ప్రజలకు ఒక్క రూపాయి పని కూడా చేయలేదన్నారు, తాను దవాఖానల్లో చికిత్స పొందుతున్నా బీఆర్ఎస్ కార్యర్తకులు తన కోసం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి మండలాల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.