కోహీర్, ఏప్రిల్ 12: జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కవేలి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాలులో కోహీర్ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే ధీమా వ్యక్తం చేశారు.
ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినట్లుగానే ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను కష్టపడి గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి ప్రచారంలో ముందుకు సాగాలన్నారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. సమావేశంలో బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.