గజ్వేల్, జూలై 31 : పట్టణంలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని తల్లిపాల సొసైటీ, డాక్టర్ వాసవచారి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ, కెమిస్ట్, అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, రోటరీ క్లబ్, లయన్స్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మండలంలోని 500 మంది తల్లులతో పాటు ప్రజలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించనున్నారు.
ఇప్పటివరకు 50 మంది తల్లులతో ఈ కార్యక్రమం నిర్వహించడం రికార్డు కాగా, గజ్వేల్ మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మరో రికార్డుగా నమోదు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి మంత్రి మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి తెలిపారు. ఈ మేరకు అందరికీ ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు ఆయన తెలిపారు.